వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు లేన్నప్పటికీ తిర్యాణి మండల ప్రజలు జేఏసీ పిలుపునకు విశేష స్పందన తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో బంద్ విజయవంతంగా కొనసాగింది.జేఏసీ పిలుపు మేరకు మండలవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి ప్రజలు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.జేఏసీ నాయకులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాల వారీగా పర్యటిస్తూ బంద్ విజయవంతానికి కృషి చేశారు. శాశ్వత రహదారుల నిర్మాణం, డబుల్ లైన్ ఏర్పాటు, వంతెనల నిర్మాణం, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం వంటి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని వారు తెలిపారు.ప్రజల ఇబ్బందులను ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలి అని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షాల మధ్య కూడా ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఉద్యమానికి అండగా నిలవడం తిర్యాణి ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
Reporter
వాస్తవ గమ్యం