Friday, 11 September 2026 01:47:33 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

రాజకీయ ముసుగులో ఆదివాసీలను వేధిస్తే సహించేది లేదు: నాయకపోడ్ సంఘం హెచ్చరిక

Date : 01 September 2026 09:14 PM Views : 728

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రాజకీయ పార్టీల కండువాలు, లెటర్ ప్యాడ్‌ల మాటున అమాయక ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న చోటా నాయకులపై మనవరి ఆదివాసి నాయకపోడ్ సంఘం అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ పరిధిలోని 1/70 చట్టాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను బెదిరించడం, సామాన్యులను బ్లాక్‌మెయిల్ చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ​టార్గెట్ చేసి వేధింపులు: స్థానిక గిరిజనులు తమ సొంత భూముల్లో చిన్నపాటి నిర్మాణాలు చేపట్టినా అక్రమమంటూ అధికారులకు ఫిర్యాదులు చేయడం, తెరవెనుక సెటిల్‌మెంట్లకు తెరతీయడం పరిపాటిగా మారింది.పక్షపాత వైఖరి: ఆదివాసీల నిర్మాణాలపై రాద్ధాంతం చేసే ఈ నకిలీ నాయకులకు, బడా నేతలు చేసే అక్రమ నిర్మాణాలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. చీకటి ఒప్పందాలు, ముడుపులతోనే వారి నోళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు.రాజకీయ ముసుగులో అధికారులను ఒత్తిడికి గురిచేస్తూ, అమాయక ఆదివాసీల పొట్టకొడుతున్న ఇలాంటి వ్యక్తులపై రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :