వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : భీమారం మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ప్రవీణ్ ఆచార్యులు మాట్లాడుతూ ప్రజలు ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి ని మొదటి పండుగగా జరుపుకుంటారని అన్నారు. ఈరోజు నుండి హిందూ పండుగలు మొదలవుతాయని తెలిపారు. సకల పాప హరణం, అనంతపుణ్య ఫల ప్రదాయకం అయినా ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు అనుగ్రహం అందరి పై ఉండాలని అన్నారు.
Reporter
వాస్తవ గమ్యం