Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి:సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి మహమ్మారి నిర్మూలనకు యువత నడుం బిగించాలని చెన్నూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ఆర్. కృష్ణ పిలుపునిచ్చారు. కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.యువత గంజాయి మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీఐ సూచించారు. గ్రామాల్లో గంజాయి విక్రయించినా, సేవించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని పేర్కొన్నారు.యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, జట్టు భావన పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా గ్రామ యువకులకు పోలీసులు రెండు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. సర్వాయిపేట గ్రామానికి చెందిన ఉప్పరి సాయికుమార్ అగ్నివీర్ సైనిక ఉద్యోగానికి ఎంపికవడంతో సీఐ ఆర్. కృష్ణ, ఎస్సై రాజశేఖర్లు అతనిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సాయికుమార్ను గ్రామ యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ బుజ్జిబాబు, గ్రామ సర్పంచ్ రాజేష్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam