వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెంట్ అకాడమీలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, విద్యార్థులు కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య ఒక్కటే మార్గమని పూలే నమ్మారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఈసీ మెంబర్ ఎండి మాతిన్ ఖాన్, నాయకులు నాగుల కిరణ్ బాబు, అడ్వకేట్ నటేశ్వర్, ముత్యం నిహార్ వర్మ, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, నాయకులు ఆయిల్లా లక్ష్మణ్ మరియు అకాడమీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం