Sunday, 13 September 2026 07:57:41 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రి మున్సిపాలిటీలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన

Date : 04 July 2026 05:26 PM Views : 81

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి లోక్ అదాలత్ – ఉచిత న్యాయ సేవలు అంశంపై శనివారం లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్ ద్వారా దృశ్య ప్రదర్శన ఏర్పాటు చేసి, న్యాయ వ్యవస్థ, ఉచిత న్యాయ సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, మంచిర్యాల సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎ. నిర్మలకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎ. నిర్మల మాట్లాడుతూ మహిళలపై జరిగే అన్యాయాలు, పోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, భూ వివాదాలు, గృహహింస, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యాయ సహాయం పొందే విధానంపై వివరించారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని, అవసరమైనప్పుడు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందించే ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. రాజలింగు, బార్ అసోసియేషన్ మంచిర్యాల అధ్యక్షుడు కొత్త సత్తయ్య, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.డి. సందాని, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆర్.ఆర్. రాములు, ఎస్. సదయ్య, న్యాయవాదులు, రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మేనేజర్ టి. రాజేశ్వరి, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఇన్‌చార్జి, టౌన్ మిషన్ కో-ఆర్డినేటర్ ఎ. రఘురాం, మెప్మా గ్రూప్ రిసోర్స్ పర్సన్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: