వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : ఏఐటీయూసీ యూనియన్ అభివృద్ధి కోసం మరియు బ్రాంచ్ కమిటీని మరింత బలోపేతం చేసే దిశగా కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా ఆర్జీ-2 బ్రాంచ్ సెక్రటరీగా గంధం సాంబశివరావు ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా ఆవుల రవికుమార్ను ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఉప ప్రధాన కార్యదర్శి వై.వి. రావు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన నాయకత్వంలో యూనియన్ మరింత ఉధృతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో డైరెక్టర్ తో జరగనున్న చర్చలు సఫలం కావాలని, లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మెడికల్ బోర్డు ఏర్పాటు, డిపెండెంట్ ఉద్యోగాలు, సొంత ఇంటి పథకం, ఐటీ రిఫండ్ మరియు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు వంటి అంశాలపై యాజమాన్యం తక్షణమే స్పందించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి రాజరత్నం, బ్రాంచ్ నాయకులు అన్నారావు, శాంసన్, పిట్ కార్యదర్శులు సెగ్గం శంకర్, తాళ్లపల్లి నారాయణ,కుమారస్వామి, మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం