వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలని లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సొత్తుకు సుదర్శన్, నర్సింగరావు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విలేజ్ మందమర్రిలో ని రామాలయం సమీపంలో యోగ పై ఉచిత శిక్షణ ఇస్తున్నారని ప్రతి ఒక్కరు యోగ చేయాలని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అనేక రకాల రుగ్మతలు నయమవుతాయని వారు పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన శిక్షణ చివరి రోజు కావడంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణకు హాజరైన వారిలో మంచి ప్రదర్శన కనబరిచిన "యోగ నేర్చుకున్న" వారికి మొదటి, రెండవ, మూడవ బహుమతులు అందజేస్తామని వారు పేర్కొన్నారు. విలేజ్ మందమర్రిలో నరసింగరావు ప్రణతి దంపతుల ఆధ్వర్యంలో, శ్రీమతి మీనాక్షి యోగ మరియు పిరమిడ్ ధ్యానం శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మందమర్రి లైన్స్ క్లబ్ అధ్యక్షులు పూసాలవెంకటరత్నం,పోలుశ్రీనివాస్,జాకీర్,అనిత,లూథర్,ఆలయ పూజారి,తదితరులు, పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం