వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత మరోసారి నిరూపించారు. రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామానికి చెందిన సందీప్ అనే కౌలు రైతు సమస్యను ఆమె ఫోన్ ద్వారానే పరిష్కరించి అభినందనలు అందుకున్నారు. ఘటన వివరాల్లోకి వెళ్తే.కొమురవెల్లికి చెందిన రైతు సందీప్ తన పొలం వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో, ఆమె వెంటనే స్పందించి స్వయంగా రైతుతో ఫోన్లో మాట్లాడారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు.కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యంలో తేమ శాతం నిబంధనల మేరకు ఉండాలి.ధాన్యంలో మట్టి గడ్డలు, తాలు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన ప్రతి రైతు ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం