Friday, 11 September 2026 01:45:34 PM
# జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు # మందమర్రి లో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి.

గుర్తింపు కార్డులు, యూనిఫాం, పారితోషికం కల్పించాలని వినతి

Date : 08 September 2026 03:24 PM Views : 87

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : జైనూర్ మండలంలోని డీసీఎస్ పరిధిలో పంట సర్వే వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వాలంటీర్లు వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ప్రభుత్వం సూచించిన విధంగా గ్రామాల్లో పంటల వివరాల సేకరణ, రైతులకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడం వంటి బాధ్యతలను తాము నిర్వహిస్తున్నామని వాలంటీర్లు తెలిపారు.అయితే విధులు నిర్వహిస్తున్న తమకు ఇప్పటివరకు గుర్తింపు కార్డులు, యూనిఫాం/డ్రెస్, సరైన పారితోషికం వంటి సౌకర్యాలు కల్పించలేదని పేర్కొన్నారు.పంట సర్వే సమయంలో గ్రామాల్లో రైతులు, ప్రజలు వాలంటీర్లను గుర్తించేందుకు గుర్తింపు కార్డులు ఎంతో అవసరమని తెలిపారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవు తున్నాయని, అలాగే విధులకు అనుగుణంగా పారితోషికం చెల్లించాలని కోరారు.ఈ సందర్భంగా అధికారులు తమ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరుతూ ఐదు ప్రధాన డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. వాలంటీర్లకు అధికారిక గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట సర్వేలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పారితోషికం సక్రమంగా చెల్లించాలని, విధుల నిర్వహణకు అవసరమైన పత్రాలు, పరికరాలు అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో పంట సర్వే వాలంటీర్లు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: