Sunday, 13 September 2026 06:58:12 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.ముగ్గురు అరెస్ట్

Date : 27 June 2026 08:16 PM Views : 164

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-363లోని అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ లేబుళ్లు, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. దీంతో వాటిని నకిలీ విత్తనాలుగా గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిలో పాత మంచిర్యాల మధురనగర్‌కు చెందిన మాకినేని రాఘవేంద్ర (39), మందమర్రి బురదగూడెంకు చెందిన కట్ట నరేష్ (41), పుట్టగంటి పవన్ కుమార్ (39) ఉన్నారు. వారి వద్ద నుంచి అపాచీ, టీవీఎస్ ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసే అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ నకిలీ విత్తనాల రవాణా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: