Tuesday, 28 July 2026 05:29:56 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత.ముగ్గురు అరెస్ట్

Date : 27 June 2026 08:16 PM Views : 138

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-363లోని అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ లేబుళ్లు, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. దీంతో వాటిని నకిలీ విత్తనాలుగా గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిలో పాత మంచిర్యాల మధురనగర్‌కు చెందిన మాకినేని రాఘవేంద్ర (39), మందమర్రి బురదగూడెంకు చెందిన కట్ట నరేష్ (41), పుట్టగంటి పవన్ కుమార్ (39) ఉన్నారు. వారి వద్ద నుంచి అపాచీ, టీవీఎస్ ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసే అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ నకిలీ విత్తనాల రవాణా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్‌తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :