వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని మందగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చింతల మధర వాటర్ఫాల్ను సందర్శించిన డీఎఫ్వో మేడంను ఎకో టూరిజం కమిటీ చైర్మన్ తుంరం గోపాల్ శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా చింతల మధర వాటర్ఫాల్ అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా ఎకో టూరిజం నిర్వహణకు సంబంధించిన లెక్కలు, నిధుల వినియోగ వివరాలను వెల్లడించాలని కోరారు. అలాగే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాటర్ఫాల్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వినతిపై డీఎఫ్వో సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎకో టూరిజం కమిటీ చైర్మన్ తుంరం గోపాల్, మందగూడ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సురేష్, సెక్షన్ ఆఫీసర్ రాంసింగ్, ఎకో టూరిజం కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం