వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు: నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న బహన్ కుమారి మాయావతి యూపీ అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా బీఎస్పీకి చెందిన 21 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్లో తెలంగాణకు పూర్తి మద్దతు ప్రకటించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన బీఎస్పీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అండగా నిలిచింది.రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా భావించే బీఎస్పీతోనే బహుజనుల అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, ఉపాధ్యక్షులు బోయినపల్లి సంతోష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్ (చెన్నూరు), దాగం శ్రీనివాస్ (బెల్లంపల్లి), బండారు రాజ్ కుమార్ (మంచిర్యాల), నాయకులు ఎండీ మతిన్ ఖాన్, కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం