వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 24: జిల్లాలో స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్కు గోదాములుగా కేటాయించిన రైస్ మిల్లులను ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని సీల్ వేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు తెలిపారు. హాజీపూర్ మండల పరిధిలో ఉన్న రాజరాజేశ్వర మిల్ గోదాము, జయలక్ష్మి మిల్, సాయి మణికంఠ మిల్లను అధికార యంత్రాంగం బుధవారం స్వాధీనం చేసుకుంది.ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చేపట్టిన ఈ చర్యలో మండల తహసీల్దార్ పుష్పలత, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ, స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ సిబ్బంది, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. సంబంధిత మిల్లులను ముందస్తుగా అధికారికంగా స్వాధీనం చేసుకుని తాళాలు వేసి సీల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.జిల్లాలో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన గోదాముల నిర్వహణ, నిల్వల భద్రత, పరిపాలనా నియంత్రణను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసి, సంబంధిత రికార్డులను సిద్ధం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం