వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : గౌడ గీత కార్మికుల సమస్యలు, సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు.గౌడ జన హక్కుల పోరాట సమితి–మోకుదెబ్బ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఆగస్టు 23వ తేదీ ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మ మైదాన్లో గల వరంగల్ హౌస్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, గౌడ గీత కార్మికుల సంక్షేమం, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం