వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గణిత విజ్ఞాన మేళాలో పాల్గొన్న కొక్కిరాల సురేఖ వాస్తవ గమ్యం, మంచిర్యాల,ఆగస్టు 22: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత విజ్ఞాన మేళా కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ను ఆమె ప్రారంభించి, ప్రదర్శనలను సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. అనంతరం సురేఖను పాఠశాల నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు షేర్ శ్రీలక్ష్మి–పవన్, సుద్దమల్ల హరికృష్ణ, చిలువేరి జ్యోతి–శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం