Tuesday, 28 July 2026 11:09:31 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

అర్ధరాత్రి ఆదివాసి ఇల్లు దహనం.. రూ.2.77 లక్షల నగదు బూడిద

కారకులపై చర్యలు తీసుకోకుంటే ఇల్లు ముట్టడిస్తాం హెచ్చరిక

Date : 17 May 2026 07:12 PM Views : 275

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి (మే 17): అర్ధరాత్రి వేళ ఆదివాసీల ఇండ్లు కాలిపోవడానికి కారకులైన పెత్తందార్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స గ్రామంలో ప్రమాద స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు.మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పాలేరుగా జీవిస్తున్న సిడం లచ్చన్న, సిడం రాకేష్‌ల అద్దె ఇల్లు మే 5న జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బీరం భాస్కర్ రెడ్డి తన పెరట్లోని చెత్తను కాల్చి, నిప్పులు ఆర్పకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారని పున్నం తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 2.77 లక్షల నగదు, 10 తులాల వెండి బూడిదయ్యాయన్నారు.బాధితులను ఆదుకోవాల్సింది పోయి యజమాని శెనిగరపు మల్లారెడ్డి మానసికంగా హింసించడం దుర్మార్గమని, ఘటన జరిగి 10 రోజులు దాటినా మంత్రి వివేక్, పోలీసులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి, న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీరం భాస్కర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలండి ముత్తయ్య, ఆత్రం సంపత్, కోర్తే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: