వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి సింగరేణి ఏరియాలోని కేకే-5 గనిలో శనివారం తొలి షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న బదిలీ కార్మికుడు బెజ్జంకి మహేందర్కు క్యాంటీన్లో ప్రమాదం జరిగింది. క్యాంటీన్లో ఉన్న ఫ్యాన్ తగలడంతో ఆయన బొటనవేలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.గాయపడిన మహేందర్కు సింగరేణి అధికారులు వెంటనే ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Reporter
వాస్తవ గమ్యం