Wednesday, 29 July 2026 05:42:24 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

మందమర్రి సింగరేణి హైస్కూల్‌లో ఘనంగా యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

Date : 25 June 2026 06:04 PM Views : 559

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 25: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్ (కళ్యాణిఖని)లో గురువారం 'ఈగల్ ఫోర్స్ తెలంగాణ' పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా యాంటీ డ్రగ్ హెల్ప్‌లైన్ 1908కు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో కలిసి అధికారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించే అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, అలాగే సింగరేణి, కార్మల్, లిటిల్ ఫ్లవర్, శ్రీచైతన్య, కృష్ణవేణి, మాంటెస్సోరి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: