వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 25: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమర్రి పట్టణంలోని సింగరేణి కాలరీస్ ఎయిడెడ్ హైస్కూల్ (కళ్యాణిఖని)లో గురువారం 'ఈగల్ ఫోర్స్ తెలంగాణ' పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సరఫరా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా యాంటీ డ్రగ్ హెల్ప్లైన్ 1908కు తెలియజేయాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బందితో కలిసి అధికారులు డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అలాగే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను వివరించే అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, అలాగే సింగరేణి, కార్మల్, లిటిల్ ఫ్లవర్, శ్రీచైతన్య, కృష్ణవేణి, మాంటెస్సోరి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం