వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గం రవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మృతుడి నివాసానికి చేరుకుని రవి భౌతికకాయానికి ఘన నివాళులర్పించారు.సాధారణ రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక అన్నగా రవి అంతిమ యాత్రలో పాల్గొన్న నల్లాల ఓదెలు స్వయంగా పాడ మోసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అంతిమ యాత్ర పొడవునా డప్పు కొడుతూ రవికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. ఓదెలు ఈ చర్య స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయం కింద 10,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం