వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో గత 25 ఏళ్లుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంపై మందమర్రి మున్సిపల్ ఎన్నికల సాధన కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కమిటీ సభ్యులు ఒక వినతిపత్రం సమర్పించారు.1/70 చట్టం అమలులో ఉండటం వల్లే ఇక్కడ ఎన్నికలు నిలిచిపోయాయని కమిటీ పేర్కొంది. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పట్టణ అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా సమస్యలు పేరుకుపోయాయని వివరించారు.కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసి 1/70 చట్టం సమస్యను పరిష్కరించాలని కోరారు.తద్వారా త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిపాలనను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ అందుగుల శ్రీనివాస్, మిట్ట లక్ష్మణ్, మాయ రమేష్, రాయబారం వెంకన్న, గాజుల శంకర్, ఎండి మోహిత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం