వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి: మండలంలోని మంగీ గ్రామపంచాయతీ పరిధిలో గల కుంటగూడ, పటేల్ గూడ, వేడ్మగూడ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ రాయిసీడం వినోద్ కుమార్.ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆయా గ్రామాల్లోని దారులన్నీ పూర్తిగా బురదమయంగా మారుతున్నాయని, దీనివల్ల స్థానిక ప్రజలు, వాహనదారులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం