వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి: దేశంలోని అణగారిన వర్గాలకు, మహిళలకు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులే రక్షణ కవచాలని బెల్లంపల్లి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ రాంటెంకి అన్నారు. నెన్నెల మండలం (కుశ్నపల్లి, కోణంపేట), వేమనపల్లి మండలం (బుయ్యారం, చామనపల్లి) గ్రామాల్లో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో అవమానాలను భరించి ప్రపంచమే మెచ్చే రాజ్యాంగాన్ని అందించిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. చదువు ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దుర్గం విగ్నేష్, కొండగుర్ల గంగారాం మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం