వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: సింగరేణి విశ్రాంత కార్మికుల ఐకమత్యం, నిరంతర పోరాటం ఫలితంగానే విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. ఈ బీమా పథకం విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీమా సౌకర్యం పొందేందుకు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి విశ్రాంత ఉద్యోగి ఈ పథకంలో నమోదు చేసుకొని ప్రభుత్వ కల్పించిన భద్రతను వినియోగించుకోవాలని వెంకటయ్య కోరారు.
Reporter
వాస్తవ గమ్యం