వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరానికి తరలించారని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసినప్పటికీ, రైతులకు వాస్తవంగా ఎన్ని టీఎంసీల సాగునీరు అందించారో ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కంటే కమిషన్లకే ప్రాధాన్యం ఇచ్చి ప్రాజెక్టు రూపురేఖలు మార్చారని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రభావంతో చెన్నూర్ మండలంలోని అనేక గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. బాధిత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్ల నష్టపరిహారం అందించి అండగా నిలిచిందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తూ సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
Reporter
వాస్తవ గమ్యం