Saturday, 12 September 2026 04:36:10 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం: 'త్రీఫేస్' లేక ఆందోళనలో అన్నదాతలు

Date : 04 August 2026 10:49 AM Views : 72

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : రెబ్బెన (ఆసిఫాబాద్):విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పంటలకు నీరందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ నుండి పైకాజిగూడకు వెళ్లే త్రీఫేస్ (3-Phase) విద్యుత్ లైన్ దెబ్బతిని చాలా రోజులు గడుస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నామమాత్రపు పనులతో మభ్యపెడుతున్న అధికారులు.ప్రస్తుతం పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయం కావడంతో, కరెంట్ సరఫరా లేక బోర్లు, మోటార్లు పనిచేయడం లేదు. విద్యుత్ లైన్ మరమ్మతులపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, ఫోన్లు చేసినా సరైన స్పందన లభించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయికి వచ్చి సమస్యను పరిష్కరించకుండా, కేవలం నామమాత్రపు పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ​పెట్టుబడులు మునిగిపోతాయని ఆందోళన సమయానికి నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని, దీనివల్ల తాము లక్షల రూపాయల పెట్టుబడి నష్టపోతామని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నారాయణపూర్ – పైకాజిగూడ త్రీఫేస్ విద్యుత్ లైన్‌కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సక్రమంగా కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :