Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : రాష్ట్రంలో గత రెండేళ్లుగా నిలిచిపోయిన విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్ మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్, అలాగే భారత రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర విద్యార్థి విభాగం కలెక్టరేట్ ఏ ఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు.గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.నిధులు రాకపోవడం వల్ల వేలమంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్నారని, కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిధులు విడుదల చేయాలని, లేనిపక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి భారత రాష్ట్ర విద్యార్థి విభాగం, కార్యకర్తలు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Admin
Vastava Gamyam