వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వట్టివాగు ప్రాజెక్టును ఎమ్మెల్యే కోవా లక్ష్మి సందర్శించి, అక్కడ కొనసాగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి సాగుకు అవసరమైన నీటిని సకాలంలో విడుదల చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెబ్బెన మండల సింగిల్ విండో చైర్మన్ సంజీవ్ మాట్లాడుతూ, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తు పనులను వేగవంతం చేసి, సాగునీటిని వెంటనే అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను కోరారు.వట్టివాగు ఆయకట్టు పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం