Saturday, 12 September 2026 09:04:57 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మందమర్రిలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి విమర్శలు గత పదేళ్లలో సింగరేణిని నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం

Date : 26 June 2026 05:30 PM Views : 203

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూన్ 26 : గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాజకీయ జోక్యం పెరగడంతో సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వైఖరిపై విమర్శలు చేశారు.సింగరేణి కార్మికుల్లో టిబీజీకేఎస్‌కు ఆదరణ లేకపోవడం వల్లే గత యూనియన్ ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదని అన్నారు.ముఖ్యమంత్రి కుమార్తె టిబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ సింగరేణి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.ఇసుక రీచ్‌ల పేరుతో బాల్క సుమన్ ఈ ప్రాంత వనరులను దోచుకున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రకటించిన ఓపెన్‌కాస్ట్ గనులకు బదులుగా కొత్త భూగర్భ గనుల ఏర్పాటు హామీ అమలు కాలేదని విమర్శించారు.సింగరేణి ప్రాంత ఆస్తులను ధ్వంసం చేసేలా స్థానిక నాయకులు, యువకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘునాథ్ రెడ్డి అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సోలార్ ప్లాంట్‌తో పాటు మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చేస్తున్న కృషిని ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.కార్మిక శాఖ మంత్రిగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంలో, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల వేతనాల పెంపులో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం సింగరేణి సంస్థ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా మందమర్రిలో టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారని రఘునాథ్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, పట్టణ కమిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: