Tuesday, 28 July 2026 05:34:36 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

ఈ నెల 31లోగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు

Date : 17 July 2026 07:34 PM Views : 27

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సూచించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రేషన్ కార్డుల్లో నమోదైన లబ్ధిదారుల వివరాల పారదర్శకతను నిర్ధారించడం, నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రాయితీ ప్రయోజనాలు నిరంతరాయంగా అందేలా చేయడం కోసం ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిందని తెలిపారు.జిల్లాలో ఇంకా గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదని పేర్కొంటూ, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి జిల్లాలో 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు స్వయంగా సంబంధిత లేదా సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు నమోదు చేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, జిల్లాలోని రేషన్ కార్డు దారులందరూ వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు కోరారు.ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: