వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో రైల్వే ఫ్లైఓవర్ కింద రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపల్ అధికారులు అక్రమ టెలాలను తొలగిస్తున్నారు. అయితే ఒక వైపు టెలాలను మాత్రమే తొలగించి, మరో వైపు వాటిని వదిలివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయని, తొలగింపులో వివక్ష లేకుండా అన్ని అక్రమ టెలాలు, అనధికార పార్కింగ్ను పూర్తిగా తొలగించాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సమగ్రంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Admin
వాస్తవ గమ్యం