Saturday, 12 September 2026 05:46:38 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Date : 25 June 2026 08:47 PM Views : 205

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 25: మంచిర్యాల–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది. ట్రాక్ పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉండవచ్చని లేదా ఇతర కారణాలతో మృతి చెందిన ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆయన వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 96186 89879, 87126 58596 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ముందుకు వస్తే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, రైల్వే మార్గాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: