Tuesday, 28 July 2026 03:08:35 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

Date : 25 June 2026 08:47 PM Views : 161

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 25: మంచిర్యాల–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది. ట్రాక్ పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉండవచ్చని లేదా ఇతర కారణాలతో మృతి చెందిన ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆయన వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 96186 89879, 87126 58596 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ముందుకు వస్తే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, రైల్వే మార్గాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :