వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన స్వామి అనే యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెన్నూర్ పట్టణ సీఐ తెలిపారు.స్వామి అనే నింధితుడు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి,పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను వివాహం చేసుకుని, శారీరక,మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుండి గెంటివేశాడు. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి,నిందితుడిని అరెస్ట్ చేసారు. మైనర్ బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా,వారిపై రౌడీ షీట్ కూడా తెరుస్తామని సీఐ హెచ్చరించారు.
Admin
వాస్తవ గమ్యం