వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీరమేష్ గురువారం జిల్లా కలెక్టర్ కె. హరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తి, కొత్త గనుల విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. గోలేటి ఓపెన్కాస్ట్ గని అభివృద్ధికి కీలకమని, ప్రస్తుతం ఖైరిగూడ ఉపరితల గని నుంచే బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. కొత్త గనుల ప్రారంభానికి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
Admin
వాస్తవ గమ్యం