వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత ప్రాజెక్టు పర్యటనలతో రాజకీయ సందడి కొనసాగుతున్నప్పటికీ, పోడు భూముల సమస్య మాత్రం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట, సిర్పూర్(టి) మండలాల్లో వేల ఎకరాల పోడు భూములు సాగులో ఉన్నా, పట్టాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, రైతు భరోసా వంటి పథకాల ప్రయోజనాలు అందకపోవడంతో పాటు బ్యాంకు రుణాలు కూడా దక్కడం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు అటవీ శాఖ ఆంక్షలు, కేసులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొంటున్నారు.ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లే, తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారంపైనా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Admin
వాస్తవ గమ్యం