వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఈదులవాడి మండల పరిషత్ ప్రాథమిక (ఎం.పి.పి) పాఠశాల ఆవరణలో తలపెట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని గ్రామ మాజీ సర్పంచ్ బూసి భీమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు. పాఠశాలలో స్థలం చాలా తక్కువగా ఉందని, ఉన్న పరిమిత స్థలంలో భవనాన్ని నిర్మిస్తే విద్యార్థులకు ఆటస్థలం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రార్థన, క్రీడలు, విద్యాసంబంధిత కార్యక్రమాలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఈ నిర్మాణాన్ని వేరే ప్రభుత్వ స్థలానికి మార్చేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు.
Reporter
వాస్తవ గమ్యం