Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణల ఆదేశాల మేరకు మందమర్రి పట్టణంలోని 23వ వార్డులో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రగతి పనులపై చర్చించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.ఈ గ్రామ సభలో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ లింగయ్య, ఆర్.పి.లు భాగ్యలక్ష్మి, సరస్వతి, ఆశా వర్కర్ రజిత, సమాఖ్య అధ్యక్షురాలు బండి ఉష, పోషంపెల్లి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ ముందుంటారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తుల రమేష్, ఎర్ర రాజు, దుర్గం ప్రభాకర్, సోదరి తిరుపతి, దాసరి రాజ్ కుమార్, దుర్గం దుర్గయ్య, జక్కం సత్యం, వడ్లకొండ రంజిత్ గౌడ్, సత్యం, అజయ్, తిరుమలేశ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam