వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : అటవీశాఖ అధికారులు వేధింపులకు గురి చేయడం,భూమిని సాగు చేయనివ్వక పోవడం వల్లనే నూకల తిరుపతి అనే పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి విమర్శించారు. వేమనాపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నూకల తిరుపతి అనే రైతు పురుగుల మందు తాగి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏమాజి ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సంవత్సరం అటవీశాఖ అధికారులు వ్యవసాయ పంటలు సాగు చేయనివ్వక పోవడం వల్లనే మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన అటవీశాఖ అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని లేకుంటే దాడులు తప్పవని హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం