వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపాలిటీ 18 వార్డు సమస్యలపై కౌన్సిలర్ ఏతం శివకృష్ణ మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీ దేవి కి వినతి పత్రం సమర్పించాడు.18 వ వార్డ్ లో నూతన రోడ్లు నిర్మించాలని, చెన్నూర్ లో నూతన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల చెత్తంత చెరువుల్లో కలిసి ఆక్వా కల్చర్ దెబ్బతినడంతో పాటుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను తీర్చాలని విన్నవించాడు.గతంలో మున్సిపల్ కౌన్సిల్ లో ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగిందని, మున్సిపల్ కమీషనర్ కి, మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపాడు. మున్సిపల్ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని శివకృష్ణ తెలిపాడు . ఈ కార్యక్రమంలో బైంసా ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం