Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం చింతపల్లి రైతు వేదికలో మంగళవారం అన్నదాతలకు అవగాహన సదస్సు నిర్వహించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో పంటలు సాగు చేసుకోవాలని ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం రామచంద్ర రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల అనుభవం సాగులో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు చిక్రం కృష్ణారావు, మడావి పార్వతి, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, వైస్ చైర్మన్ టెన్త్ శ్రీనివాస్, నాయకపుగూడ ఉప సర్పంచ్ పవన్ నంద, వ్యవసాయ అధికారి వినయ్, ఏఈఓలు వినోద్ కుమార్, ముత్తయ్య, కాంగ్రెస్ నాయకులు కూన సురేష్, కనుకుంట్ల సత్యం తదితరులు పాల్గొన్నారు.
Reporter
Vastava Gamyam