వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాణి మండలంలోని కౌటాగాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎరబండ నుంచి కేరెగూడకు వెళ్లే రహదారి గుంతలు, బురదతో దెబ్బతినడంతో ఎరబండ, తాటిగూడ, కేరెగూడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రేషన్ బియ్యం తీసుకురావడం, అత్యవసర పనుల కోసం ప్రయాణించడం కష్టంగా మారింది.ఈ సమస్యను గ్రామస్థులు కౌటాగాం గ్రామ సర్పంచ్ కాతేలే మంజుల దృష్టికి తీసుకెళ్లగా, ఆమె వెంటనే స్పందించి రహదారి మరమ్మతు పనులు చేపట్టించారు. గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనువుగా మార్చడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం