Saturday, 13 June 2026 09:43:39 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

​మందమర్రిలో వైభవంగా సుందరకాండ హవనం: విశేషంగా తరలివచ్చిన భక్తులు

Date : 10 May 2026 08:47 PM Views : 797

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి, పట్టణంలోని పాలచెట్టు క్షేత్రంలో వెలసిన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు ఆధ్వర్యంలో సుందరకాండ హవనం, నాగవల్లి దళార్పణ (తమలపాకుల అర్చన) కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాల్లో పడిదల మాధవి - సురేందర్రావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు మాట్లాడుతూ సుందరకాండ పారాయణ ప్రాముఖ్యతను వివరించారు, సుందరకాండ పఠనం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ పారాయణం ఎంతో దోహదపడుతుందని భక్తుల బలమైన విశ్వాసం. ఈ పారాయణాన్ని వీక్షించినా, విన్నా సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు.హోమం కేవలం మతపరమైన ప్రక్రియే కాకుండా, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని అర్చకులు తెలిపారు. పురాణ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ప్రకృతి సమతుల్యత కోసం, సకాలంలో వర్షాలు కురవాలని హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన స్వాములు, చిన్నారులు, మహిళలు మరియు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించి, వేదమంత్రాల సాక్షిగా అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :