Wednesday, 29 July 2026 05:41:04 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలి

​విద్యార్థుల ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ​- 35 ఏళ్ల నాటి చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం ​- అధికారులకు విన్నవించిన కోలుగురి విజ

Date : 09 April 2026 02:00 PM Views : 339

వాస్తవ గమ్యం / తెలంగాణ / : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోలుగురి విజయ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు విన్నవించారు. పాఠశాల ఆవరణకు అతి సమీపంలో టవర్ నిర్మించడం వల్ల వెలువడే రేడియేషన్ విద్యార్థులపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​టవర్ నిర్మాణం కోసం సుమారు 35 ఏళ్ల చరిత్ర గల వృక్షాలను ఇప్పటికే నరికివేయడం అత్యంత బాధాకరమని, అత్యంత కాలుష్య భరితమైన మందమర్రిలో ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ​నిత్యం వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం సరికాదని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ మరియు సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. జనావాసాలు లేని ప్రాంతానికి ఈ టవర్‌ను తరలించి, పాఠశాల విద్యార్థులను, పర్యావరణాన్ని కాపాడాలని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల మిత్రులు మరియు తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :