Saturday, 13 June 2026 10:42:39 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో సెల్ టవర్ నిర్మాణం ఆపాలి

​విద్యార్థుల ఆరోగ్యంపై రేడియేషన్ ప్రభావం పడే అవకాశం ​- 35 ఏళ్ల నాటి చెట్ల నరికివేతపై పర్యావరణ ప్రేమికుల ఆగ్రహం ​- అధికారులకు విన్నవించిన కోలుగురి విజ

Date : 09 April 2026 02:00 PM Views : 316

Vastava Gamyam - తెలంగాణ / : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోలుగురి విజయ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు విన్నవించారు. పాఠశాల ఆవరణకు అతి సమీపంలో టవర్ నిర్మించడం వల్ల వెలువడే రేడియేషన్ విద్యార్థులపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​టవర్ నిర్మాణం కోసం సుమారు 35 ఏళ్ల చరిత్ర గల వృక్షాలను ఇప్పటికే నరికివేయడం అత్యంత బాధాకరమని, అత్యంత కాలుష్య భరితమైన మందమర్రిలో ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ​నిత్యం వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం సరికాదని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ మరియు సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. జనావాసాలు లేని ప్రాంతానికి ఈ టవర్‌ను తరలించి, పాఠశాల విద్యార్థులను, పర్యావరణాన్ని కాపాడాలని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల మిత్రులు మరియు తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :