వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బహిరంగంగా మద్యం సేవిస్తూ కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో మంచిర్యాల జోన్ పరిధిలో నిషేధాజ్ఞలు యథావిధిగా అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం