Saturday, 13 June 2026 10:42:14 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

శంకర్ పల్లి క్రేన్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Date : 28 April 2026 11:19 AM Views : 90

Vastava Gamyam - తెలంగాణ / హైదరాబాదు : శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సోమవారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఎన్సీసి సీ లిమిటెడ్ సంస్థకు చెందిన భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పక్కనే ఉన్న షెడ్‌పై కూలిపోయింది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆ సమయంలో షెడ్‌లో ఆశ్రయం పొందిన వలస కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఐదుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.క్షతగాత్రులు 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ​"ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. నిర్మాణ సంస్థల వద్ద భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :