Thursday, 30 July 2026 02:13:11 AM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

శంకర్ పల్లి క్రేన్ ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి

Date : 28 April 2026 11:19 AM Views : 137

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సోమవారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఎన్సీసి సీ లిమిటెడ్ సంస్థకు చెందిన భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పక్కనే ఉన్న షెడ్‌పై కూలిపోయింది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆ సమయంలో షెడ్‌లో ఆశ్రయం పొందిన వలస కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఐదుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.క్షతగాత్రులు 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ​"ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. నిర్మాణ సంస్థల వద్ద భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :