వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి 2 వ జూన్ లోని ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో డాక్టర్ జాహ్నవి ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్ధులకు వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల విద్యార్థులందరూ ప్రభుత్వం గా ఉండాలని, వర్షాకాలం సమయంలో డెంగ్యూ, మలేరియా, చర్మవ్యాధులు రాకుండా తడి దుస్తులను ధరించకూడదని, ఆరు బయట లభించే ఆహారాన్ని తీసుకోకూడదని సూచించారు. శరీరంలో ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే వ్యాధి ప్రారంభమై మొదటి దశలోని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు. సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం