Wednesday, 29 July 2026 01:38:08 AM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

ప్రభుత్వ ఉద్యోగుల గళం: జూన్ 2 లోగా పీఆర్సీ ప్రకటించాలి

Date : 10 April 2026 05:57 PM Views : 135

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైన (పీఆర్సీ) ప్రకటన, పెండింగ్ డిఏ ల విడుదల మరియు ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈ జేఏసీ సమరశంఖం పూరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ​​2026 జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి.పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి.సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004కు ముందు నియామకమైన వారికి వెంటనే పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి.ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం తక్షణమే హెల్త్ కార్డ్స్ జారీ చేసి, నగదు రహిత వైద్యం అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానున్నందున, వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి.​​ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ రెండు దశల పోరాటాన్ని ప్రకటించింది అందులో మొదటి దిఏప్రిల్ 17 నా మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు సమర్పణ. రెండోది ​మే 5 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి అందచేయ్యడం.ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అనారోగ్యం పాలైనప్పుడు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాం.అన్నారు ఇ సమావేశంలో వి. లచ్చిరెడ్డి (చైర్మన్) & ఓడనాల రాజశేఖర్ (సెక్రటరీ జనరల్)రెవెన్యూ, ఉపాధ్యాయ, మున్సిపల్, మెడికల్, అగ్రికల్చర్ మరియు ఔట్ సోర్సింగ్ విభాగాలకు చెందిన సుమారు 40కి పైగా సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేసింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: