Sunday, 13 September 2026 07:36:51 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ప్రభుత్వ ఉద్యోగుల గళం: జూన్ 2 లోగా పీఆర్సీ ప్రకటించాలి

Date : 10 April 2026 05:57 PM Views : 164

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల వాంఛలైన (పీఆర్సీ) ప్రకటన, పెండింగ్ డిఏ ల విడుదల మరియు ఇతర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈ జేఏసీ సమరశంఖం పూరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ​​2026 జూన్ 2వ తేదీ నాటికి కొత్త పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలి.పెండింగ్‌లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలి.సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ముఖ్యంగా సెప్టెంబర్ 1, 2004కు ముందు నియామకమైన వారికి వెంటనే పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలి.ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం తక్షణమే హెల్త్ కార్డ్స్ జారీ చేసి, నగదు రహిత వైద్యం అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కానున్నందున, వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి.​​ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జేఏసీ రెండు దశల పోరాటాన్ని ప్రకటించింది అందులో మొదటి దిఏప్రిల్ 17 నా మండల, డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు సమర్పణ. రెండోది ​మే 5 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి అందచేయ్యడం.ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. అనారోగ్యం పాలైనప్పుడు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నాం.అన్నారు ఇ సమావేశంలో వి. లచ్చిరెడ్డి (చైర్మన్) & ఓడనాల రాజశేఖర్ (సెక్రటరీ జనరల్)రెవెన్యూ, ఉపాధ్యాయ, మున్సిపల్, మెడికల్, అగ్రికల్చర్ మరియు ఔట్ సోర్సింగ్ విభాగాలకు చెందిన సుమారు 40కి పైగా సంఘాల ప్రతినిధులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఈ పోరాటం ఆగదని జేఏసీ స్పష్టం చేసింది.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :