వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామంలో విషాద ఘటన జరిగింది. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్కు అమర్చిన ఇనుప పెట్టె అకస్మాత్తుగా కూలిపోవడంతో సుగుణ (45) అనే ఇంటి యజమానురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. నిర్మాణ పనుల్లో భద్రతా లోపాలే ప్రమాదానికి కారణమని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
వాస్తవ గమ్యం