వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చిన ఆరు కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం ఉదయం రెబ్బెన మండల శాఖ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.గోలేటి టౌన్షిప్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని బిజెపి నాయకులు పాలతో శుద్ధి చేసి (క్షీరాభిషేకం)పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,ఆయన చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మల్రాజు రాంబాబు, జిల్లా కార్యదర్శి చెపురి నవీన్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు ఎర్ర రాజేష్, జగదీష్ మరియు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం