వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్-రే యంత్రం గత పది రోజులుగా పనిచేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందలాది మంది చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండగా, అత్యవసర వైద్య పరీక్షల్లో కీలకమైన ఎక్స్-రే సేవలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలు, ఎముకల గాయాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఆశ్రయించాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినా, పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్స్-రే యంత్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టి సేవలను పునరుద్ధరించాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం